అక్షరటుడే నిజాంసాగర్:Mohammad nagar | ప్రభుత్వశాఖల్లో అధికారులు సమయపాలనపై ఏమాత్రం శద్ధ పెట్టడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం మహమ్మద్నగర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం(Praja Parishad Office)లో సమయం 11 గంటలైనా అధికారులు పత్తాలేకుండా పోయారు. ఎంపీడీవో(MPDO) క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లగా కంప్యూటర్ ఆపరేటర్(Computer Operator) మినహా ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరు.
ఇక ఇటీవల కొత్తగా ఏర్పాటైన మహమ్మద్నగర్ తహశీల్దార్ కార్యాలయం(Tahsildar Office)లో కూడా అధికారులు సమయపాలన పాటించట్లేదని మండల ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వ కార్యాలయాల్లో(Government office) అధికారులు సమయపాలన పాటించేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.