అక్షరటుడే, బోధన్: Navipet | కుటుంబ తగాదాలతో మామను అల్లుడు హత్యచేసిన ఘటన నవీపేట్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఓ గోదాం నిర్మాణం నిమిత్తం ఛత్తీస్గడ్ (Chattisgarh) నుంచి రాజేష్ కుటుంబం వలస వచ్చింది. అయితే రాజేష్ తన భార్యను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో.. మామ బిలావ్ సింగ్ అడ్డుపడేవాడు. ఈ విషయంలో రెండురోజుల క్రితం మామఅల్లుళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశంలో మామపై అల్లుడు రాజేష్ ఇటుకలతో దాడిచేశాడు. దీంతో మామ బిలావ్సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Navipet | మామను హత్య చేసిన అల్లుడు

Bodhan | అందని వైద్యం.. గాలిలో కలిసిన ప్రాణం..