Finance companies | ఆగని ఫైనాన్సియర్ల వేధింపులు.. ఆందోళన చేస్తున్న బాధితులు
Finance companies | ఆగని ఫైనాన్సియర్ల వేధింపులు.. ఆందోళన చేస్తున్న బాధితులు

అక్షరటుడే, కామారెడ్డి: Finance companies | జిల్లాలో ఫైనాన్స్​ కంపెనీల  వేధింపుల Finance companies పర్వం కొనసాగుతూనే ఉంది. దేవునిపల్లిలోని Devunipalli ఓ ఫైనాన్స్​ కాల్​సెంటర్​ ఏజెంట్..​ భార్యాభర్తలను దుర్భాషలాడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కామారెడ్డి Kamareddy మండలం గుర్గుల్ Gurgle​ గ్రామానికి చెందిన అనిత రెండేళ్ల క్రితం ఓ ఫైనాన్స్ కంపెనీలో రూ.1.75 లక్షల రుణం తీసుకుంది. రెగ్యులర్​గా కడుతున్నప్పటికీ ఏప్రిల్​ మాసంలో 15 రోజులు లేటయ్యింది. దీంతో కాల్​సెంటర్ Call center​ ఏజెంట్​ తమకు ఫోన్​ చేసి వేధింపులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. తరచూ ఫోన్లు చేస్తూ భార్యభర్తలను దుర్భాషలాడారని వాపోయింది. కాల్​సెంటర్​కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు రాగా.. అక్కడ కూడా తమపై తిట్ల పురాణం అందుకున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Finance companies | ఆటో డెబిట్​ కావట్లేదని చెప్పినా..

పాల్వంచ Palvancha మండలం ఇసాయిపేట Isaipet village గ్రామానికి చెందిన ఉప్పు చంద్రశేఖర్ అదే ఫైనాన్సులో కారు కోసం రూ.5 లక్షలు రుణం తీసుకున్నాడు. 14 నెలలుగా రెగ్యులర్​గా కిస్తీ కడుతున్నాడు. చివరి ఈఎంఐ రెండురోజులు ఆలస్యం కావడంతో కాల్​సెంటర్​ ఏజెంట్ Agent​ ఫోన్​చేసి దుర్భాషలాడాడని వాపోయారు. ఈ ఇద్దరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.