ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​NTR District | నా చావుకు ఎమ్మెల్యేనే కారణం.. సూసైడ్​ నోట్​ రాసి అదృశ్యమైన ఏఈ

    NTR District | నా చావుకు ఎమ్మెల్యేనే కారణం.. సూసైడ్​ నోట్​ రాసి అదృశ్యమైన ఏఈ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: NTR District | తన చావుకు టీడీపీ ఎమ్మెల్యే కొలిక‌పూడి(TDP MLA Kolikapudi) కార‌ణం అంటూ నీటిపారుదల శాఖ ఏఈ(Irrigation Department AE) సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా తిరువూరు ఏఈగా పని చేస్తున్న వి. కిశోర్​ శనివారం ఉదయం సూసైడ్​ నోట్(Suicide Note)​ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

    NTR District | రిలీవ్​ చేయకుండా అడ్డుకున్నారు

    తన చావుకు ఈఈ రంగయ్య, డీఈఈ ఉమాశంకర్‌, ఈఎన్​సీ శ్యామ్ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులే కారణమని సూసైడ్ నోట్ రాశాడు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan), లోకేష్, నిమ్మల రామానాయుడిని ఆయన కోరారు. తనను బదిలీ చేసి రిలీవ్ చేయకుండా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన రిలీవింగ్​ను తిరువూరు ఎమ్మెల్యే ఆదేశాలతోనే అడ్డుకున్నారని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. తన బదిలీని రాజకీయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

    READ ALSO  AP Liquor Scam | వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. లిక్కర్ కేసులో నడుస్తున్న ఉత్కంఠ

    NTR District | తిరిగి తిరిగి అలసిపోయా

    తన రిలీవింగ్(Releaving)​ కోసం అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయానని సూసైడ్​ నోట్​లో కిశోర్​ పేర్కొన్నారు. ఒక దళిత ఉద్యోగిగా తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దన్నారు. తనకు వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాశాడు. అనంతరం ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా కనిపించకపోవంతో కుటుంబ సభ్యులు ఆందోలన చెందుతున్నారు.

    Latest articles

    Air India | మరో విమానంలో సాంకేతిక లోపం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | విమానాల్లో సాంకేతిక లోపాలతో (Technical Issue) ప్రయాణికులు హడలిపోతున్నారు. ఫ్లైట్...

    Bonalu Festival | మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్​.. రేపు వైన్స్ లు​ బంద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bonalu Festival | హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. గోల్కొండ...

    Kodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్​ ఛైర్మన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kodanda Reddy | తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ (Farmers Commission Chairman) కోదండ...

    Alimony | మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు చోరీల బాట.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Alimony | మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు ఓ వ్యక్తి దొంగగా మారాడు. భార్యాభర్తల...

    More like this

    Air India | మరో విమానంలో సాంకేతిక లోపం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | విమానాల్లో సాంకేతిక లోపాలతో (Technical Issue) ప్రయాణికులు హడలిపోతున్నారు. ఫ్లైట్...

    Bonalu Festival | మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్​.. రేపు వైన్స్ లు​ బంద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bonalu Festival | హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. గోల్కొండ...

    Kodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్​ ఛైర్మన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kodanda Reddy | తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ (Farmers Commission Chairman) కోదండ...