అక్షరటుడే, వెబ్డెస్క్: Excise Police | కల్తీ కల్లుకు బానిసలై ఎంతో మంది బలి అవుతున్నారు. మత్తు పదార్థాలతో తయారు చేసిన ఈ కల్లుకు అలవాటు పడిన వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
ఇటీవల హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి(Kukat Pally)లో కల్తీ కల్లు తాగి 8 మంది చనిపోగా చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయినా కల్తీ కల్లు(Kalthi Kallu) విక్రయాలు మాత్రం ఆగడం లేదు. అధికారులకు దొరకకుండా కల్తీ కల్లు అమ్మే వారు కొత్త కొత్త దారులు అవలంభిస్తున్నారు. తాజాగా పాల ప్యాకెట్ల (Milk Packets) రూపంలో కల్లు విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు(Excise Officers) అరెస్ట్ చేశారు.
మేడ్చల్ (Medchal)లోని అయోధ్య నగర్లోని గుండ్లపోచంపల్లిలోని (Gundlapochampally) ఒక హోటల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఎస్వీఎస్ బ్రాండ్ (SVS Brand) పేరుతో పాల ప్యాకెట్ల రూపంలో కల్తీ కల్లు అమ్ముతున్నట్లు వారు గుర్తించారు. 270 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. శంకర్ గౌడ్ నిర్వహిస్తున్న హోటల్లో అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్నట్లు తెలిసింది. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇతర చోట్ల కూడా ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. మల్కాజ్గిరి పరిధిలో 20 లీటర్లు కల్లు స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్లో 750 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. పల్లె భిక్షపతి, బోడిగే శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.