అక్షరటుడే, వెబ్డెస్క్: Rahul Gandhi | దేశంలోని ప్రస్తుత రాజకీయాలపై ఏఐసీసీ అగ్రనేత AICC Leader రాహుల్ గాంధీ Rahul Gandhi ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో (Hyderabad) జరుగుతున్న భారత్ సమ్మిట్ (India Summit)లో ఆయన శనివారం పాల్గొన్నారు. మొదటగా పహల్గామ్ (Pahalgam) దాడిలో మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచంలో రాజకీయాలు చాలా మారిపోయాయన్నారు.
ఇప్పుడంతా కొత్తతరం రాజకీయం నడుస్తోందని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రతో (India Jodo Yatra) ఎంతో తెలుసుకున్నానని.. ప్రజల కష్టసుఖాలు దగ్గరుండి చూశానన్నారు. భారత్ జోడో యాత్రలో దేశ ప్రజలు తనపై ఎంతో ప్రేమ చూపించారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే రాజకీయాలు చాలా మారిపోయాయని, పదేళ్లక్రితం రాజకీయాలకు ఇప్పటికి ఎంతో తేడా ఉందని వివరించారు. చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం రావడం లేదని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
Rahul Gandhi | తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు..
తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాహుల్గాంధీ పేర్కొన్నారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాహుల్ పేర్కొన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ సహా పార్టీ ముఖ నేతలు, మంత్రులు రాహుల్ గాంధీకి ఘనస్వాగతం పలికారు.