అక్షరటుడే, ఇందూరు: Collector Vinay Krishna Reddy | విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ క్విజ్(NSPC) పోటీలకు సంబంధించిన వాల్పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని విద్యార్థులంతా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డీఈవో అశోక్ (DEO Ashok) మాట్లాడుతూ.. జూలై 1 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ‘ఏకో మిత్రం యాప్’ (Eco Mitram App) ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 30న ఫలితాలు ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి పరిశోధన విద్యార్థుల వరకు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందన్నారు. తరగతి, వయసును బట్టి ఐదు విభాగాల్లో పోటీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ ఐఏఎస్ కరోలిన్ చింగ్తియాన్మావి, డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, తదితరులు పాల్గొన్నారు.