అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లో రాష్ట్రస్థాయి బోనాల జాతర నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు పోతుగంటి గంగాధర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం నగరంలోని కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కుమ్మర్లు తప్పకుండా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోశాధికారి భూమన్న, కార్యదర్శి లక్ష్మణ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Nizamabad City | 26న కుమ్మర్ల బోనాల జాతర

Nizamabad City | 26న కుమ్మర్ల బోనాల జాతర