అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipal Corporation | మహిళలు మొక్కలను నాటి పర్యవేక్షించాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ (Municipal Corporation Commissioner Dilip Kumar) తెలిపారు. శుక్రవారం కాలూరు చెరువు వద్ద ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (Environment Day) పురస్కరించుకొని చెరువు చుట్టూ 400 మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల ప్రతినిధులు మొక్కల పెంపకంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Nizamabad Municipal Corporation | మొక్కలు నాటి పర్యవేక్షించాలి

Nizamabad Municipal Corporation | మొక్కలు నాటి పర్యవేక్షించాలి