అక్షరటుడే, వెబ్డెస్క్ : Indus River | సింధూ నది sindhu river water నుంచి ఒక్క చుక్క కూడా పాక్కు pakistan వెళ్లకుండా భారత్ bharat plans పక్కా వ్యూహాలు రచిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack వెనుక పాకిస్తాన్ ఉందని.. ఆదేశంతో భారత్ ఒప్పందాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సింధూ నది జలాలు ఆ దేశానికి వెళ్లకుండా ఆపేసింది. అయితే సింధూ నదిపై ఆధారపడే ఆ దేశంలో అధిక శాతం వ్యవసాయం pak agriculture చేస్తారు. తాగు, సాగు నీటికి అవసరమైన సింధు జలాలను భారత్ ఆపితే పాక్ ఎడారిగా మారడం ఖాయం.
ఇప్పటికే సింధూ జలాలను నిలిపివేసిన భారత్ దీనిపై వరల్డ్ బ్యాంక్తో world bank చర్చించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలుపై అమిత్ షా Amit Shah కీలక సమావేశం నిర్వహించారు. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ cr Patil, ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు. అయితే 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్య వర్తిత్వంతో భారత్- పాకిస్తాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం కుదిరింది. మూడు దశల్లో సింధూ జలాలు పాక్కు దక్కకుండా చేసే భారత్ ప్లాన్చేస్తోంది. నాడు మధ్యవర్తిత్వం చేసిన ప్రపంచ బ్యాంక్కు మొదట మన వైఖరి తెలియజేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఆర్థికంగా దివాళా తీసిన పాక్ సింధూ జలాలు రాకపోతే మరింత దిగజారనుంది.