More
    Homeక్రీడలుIPL 2025 | ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ఆ IPL మ్యాచ్ తరలింపు!

    IPL 2025 | ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ఆ IPL మ్యాచ్ తరలింపు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ (Punjab Kings and Mumbai Indians) మధ్య జరగాల్సిన మ్యాచ్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. ధర్మశాల వేదికగా (dharamsala stadium) ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు (ahmedabad) తరలించినట్లు సమాచారం.

    ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) (బీసీసీఐ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో (jammu and kashmir) గత నెల 22న జరిగిన పహల్​గామ్​ ఉగ్రదాడికి (Pahalgam terror attack) ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు మంగళవారం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై (pakistan terrorist camps) మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో (India and Pakistan borders) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా పాకిస్థాన్ సరిహద్దులకు (Pakistani border) సమీపంగా ఉండే 18 విమానాశ్రయాలను భారత ప్రభుత్వం (Indian government) తాత్కాలికంగా మూసివేసింది. ఇందులో ధర్మశాలతో పాటు ఛండీఘడ్, అమృత్ సర్, జమ్మూ, శ్రీనగర్ కూడా ఉన్నాయి.

    READ ALSO  Wasim Akram Statue | హైదరాబాద్‌లో పాక్ బౌల‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌.. ముఖ కవళికలు చూసి ఫ్యాన్స్ కూడా న‌వ్వుకుంటున్నారు..!

    ఈ నిర్ణయంతో ధర్మశాల వేదికగా (dharamsala venue) జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల (IPL matches) నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆపరేషన్ సింధూర్‌కు (Operation Sindoor) ముందే ధర్మశాలకు చేరుకున్న పంజాబ్, ఢిల్లీ జట్లు (punjab and delhi teams).. గురువారం తలపడనున్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్ కోసం ముంబై.. ధర్మశాల వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బీసీసీఐ వేదికను మార్చుతున్నట్లు తెలుస్తోంది.

    వేదిక మార్పు విషయాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ అనిల్ పటేల్ (Gujarat Cricket Association Secretary Anil Patel) ధ్రువీకరించారు. ముంబై-పంజాబ్ మ్యాచ్ (mumbai-punjab match) అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం జరుగుతుందని చెప్పారు. ‘పంజాబ్-ముంబై మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వాలని బీసీసీఐ మమ్మల్ని కోరింది. ముంబై గురువారం సాయంత్రానికి అహ్మదాబాద్ చేరుకుంటుంది. పంజాబ్ కింగ్స్ రాక గురించి త్వరలోనే తెలియనుంది.’ అని అనిల్ పటేల్ పేర్కొన్నాడు. మరోవైపు వేదిక మార్పు గురించి బీసీసీఐ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని పంజాబ్ కింగ్స్ (punjab kings) పేర్కొంది.

    READ ALSO  Ahmedabad Plane Crash | 31 మంది మృత‌దేహాల అప్ప‌గింత..

    Latest articles

    ISKCON Temple | ఇస్కాన్ టెంపుల్​కు రూ.10 లక్షల విరాళం

    అక్షరటుడే, బాన్సువాడ: ISKCON Temple | కామారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న ఇస్కాన్ టెంపుల్​కు బాన్సువాడ పట్టణానికి చెందిన కంకణాల...

    Stock Market | భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | మిడిల్‌ ఈస్ట్‌(Middle East)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల...

    Maharashtra | రైలులో మంటలు.. అసలు ఏం జరుగుతోంది..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Maharashtra | వరుస విషాదాలు దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో 274 మంది...

    Raja Saab Teaser | కేక పెట్టించిన రాజా సాబ్ టీజర్.. టోటల్ ఇండియా షేక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Raja Saab Teaser | యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్(Young Rebel Star Prabhas) నుండి...

    More like this

    ISKCON Temple | ఇస్కాన్ టెంపుల్​కు రూ.10 లక్షల విరాళం

    అక్షరటుడే, బాన్సువాడ: ISKCON Temple | కామారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న ఇస్కాన్ టెంపుల్​కు బాన్సువాడ పట్టణానికి చెందిన కంకణాల...

    Stock Market | భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | మిడిల్‌ ఈస్ట్‌(Middle East)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల...

    Maharashtra | రైలులో మంటలు.. అసలు ఏం జరుగుతోంది..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Maharashtra | వరుస విషాదాలు దేశాన్ని వెంటాడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో 274 మంది...