అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipal Corporation | రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ (Municipal Corporation) కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ప్రధానంగా డీ-54 కెనాల్ (D-54 Canal)తో పాటు ప్రధాన డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు (Sanitary inspectors) ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఏఎంసీ జయ కుమార్, ఇన్ఛార్జి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, తదితరులున్నారు.
Nizamabad Municipal Corporation | మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Nizamabad Municipal Corporation | మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి