Site icon aksharatoday.in

Mla Prashanth reddy | ఎంపీ అర్వింద్​ చేసిన అభివృద్ధి శూన్యం

Mla Prashanth reddy | ఎంపీ అర్వింద్​ చేసిన అభివృద్ధి శూన్యం

Mla Prashanth reddy | ఎంపీ అర్వింద్​ చేసిన అభివృద్ధి శూన్యం

అక్షరటుడే, ఆర్మూర్‌ : Mla Prashanth reddy | రెండుసార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ (Mp Arvind)​ జిల్లా ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ (KCR), కేటీఆర్, కవిత, హరీష్‌రావుపై అర్వింద్​ చేసిన అనుచిత వ్యాఖలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తిని విమర్శించడానికి అర్వింద్‌కు అర్హత, స్థాయి లేదన్నారు.

మోదీని చూసి ప్రజలు ఓట్లేస్తున్నారని, ఎంపీ అర్వింద్​ను చూసి వేయట్లేదని ఎద్దేవా చేశారు. 71ఏళ్లు ఉన్న కేసీఆర్​ను ముసలివాడు అంటే 74 ఏళ్లు ఉన్న పీఎం మోదీని ఏమనాలని ప్రశ్నించారు. అర్వింద్​ మాట్లాడిన దిగజారుడు మాటలు ఆయన స్థాయిని సూచిస్తున్నాయన్నారు. ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉండి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్​ను విమర్శించడానికి ఎంపీ అర్వింద్​కు ఏమాత్రం అర్హత, స్థాయి లేదని స్పష్టం చేశారు.

Exit mobile version