అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Drunk drive | మద్యం తాగి వాహనం నడిపిన ఆరుగురికి జైలు శిక్షతోపాటు మరో 23 మందికి జరిమానా విధించారు.
ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (ACP Masthan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ (Inspector Prasad) ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి వారిని 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ (Second Class Magistrate NoorJahan) ఎదుట హాజరుపర్చగా 23 మందికి రూ.30వేల జరిమానా విధించారు. మరో ఆరుగురికి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందని ఏసీపీ వివరించారు.
Drunk drive | వన్టౌన్ పరిధిలో..
నగరంలోని వన్ టౌన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష విధించిందని ఎస్హెచ్వో రఘుపతి (SHO Raghupathi) తెలిపారు. ఆదివారం రాత్రి కుమార్గల్లీ (Kumar Gally) వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించగా పాములబస్తీకి (Pamulabasthi) చెందిన శివకుమార్ అధికంగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా అతడికి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
Drunk drive | మద్యం తాగి వాహనాలు నడపొద్దు..
మద్యం తాగి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ పేర్కొన్నారు. ఇలా తాగి వాహనాలు నడిపితే.. వారికే కాకుండా ఇతరుకుల కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని.. వారు వాహనాలు నడిపితే మైనర్ల తల్లిదండ్రులపై కేసులు పెడతామని ఎస్హెచ్వో స్పష్టం చేశారు.