అక్షరటుడే, వెబ్డెస్క్: Maharashtra | పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్యలు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు తరచూ చూస్తూ ఉంటాం. కానీ మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు తెచ్చుకుందనే కోపంతో ఓ తండ్రి తన కూతురిని చితకబాదాడు. కర్రతో దాడి చేయగా కూతురు రక్తపుమడుగులో కుప్పకూలింది. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆ యువతి చనిపోయింది.
Maharashtra | మార్కులు రాలేదని..
మహారాష్ట్రలోని (Maharastra) సాంగ్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో మృతురాలి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, నిందితుడు ఓ స్కూల్కు ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తుండడం గమనార్హం. అమ్మాయి పదో తరగతి బోర్డు పరీక్షలలో 92.60 శాతం మార్కులు సాధించింది. కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ సమయంలో నీట్ ఎంట్రెన్స్ (Neet Exam) రాయగా తక్కువ మార్కులు రావడంతో ఆమె తండ్రి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ప్రాణాలు వదిలింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లి(Sangli)లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాంగ్లికి చెందిన ధోండిరామ్ భోంస్లే స్థానికంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
ఇతనికి 17 ఏళ్ల ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరు సాధన భోంస్లే, ఈమె ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ప్రీ-మెడికల్ టెస్ట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కోసం శిక్షణ తీసుకొంటోంది. అయితే ఇటీవల నీట్ పరీక్ష(Neet Exam) రాసింది. అందులో తక్కువ మార్కులు స్కోర్ చేయడంతో ఆమెకు సీటు రాలేదు. దీంతో ధోండిరామ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కూతురును కర్రతో దారుణంగా కొట్టాడు. తండ్రి దాడిలో సాధన తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే ఆమెను తండ్రి హాస్పిటల్కు తరలించాడు. కాగా.. సాధన హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. తండ్రి కొట్టడంతో తీవ్రంగా గాయపడిన సాధన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని సాధన తల్లి ఫిర్యాదులో పేర్కొంది.