Site icon aksharatoday.in

Mancherial | ప్రమాదంలో లారీ డ్రైవర్ల దుర్మరణం.. మానవత్వం మరిచి సబ్బులు ఎత్తుకెళ్లిన జనం

Mancherial

Mancherial | ప్రమాదంలో లారీ డ్రైవర్ల మృతి.. మానవత్వం మరిచి సబ్బులు ఎత్తుకెళ్లిన జనం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mancherial | సమాజంలో రోజురోజుకు మానవత్వం కనుమరుగు అవుతోంది. ప్రజలు ఇతరుల గురించి పట్టించుకోవడం మానేసి, స్వలాభం చూసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో మద్యం వాహనం బోల్తా పడగా జనాలు మందు బాటిళ్లను తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. తాజాగా ఇటువంటి ఘటనే మంచిర్యాల(Mancherial) జిల్లాలో జరిగింది.

సాధారణంగా రోడ్డు ప్రమాదం(Road accident) జరిగితే అయ్యో పాపం అంటాం. వీలైతే చేతనైనా సాయం చేస్తాం. కానీ వీరు మాత్రం సంబుర పడ్డారు. ప్రమాదం కారణంగా లారీలో నుంచి పడిపోయిన సబ్బు కాటన్లను ఎత్తుకొని పారిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందిన మానవత్వం మరిచి సబ్బులు ఎత్తుకెళ్లారు.మంచిర్యాల జిల్లా ఇటిక్యాల(Itikyala) సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. లారీలు వేగంగా ఉండటంతో నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు(Drivers) అక్కడికక్కడే మృతి చెందారు.

అయితే అందులో ఓ లారీ సంతూర్​ సబ్బుల కాటన్(Santoor soap cotton)​లతో వెళ్తోంది. ప్రమాదంతో సబ్బు కాటన్​లు రోడ్డుపై పడిపోయాయి. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు వాటిని ఎత్తుకు వెళ్లారు. జనాలు ఎగబడి మరీ సబ్బులును తీసుకెళ్లారు. కనీసం ఇద్దరు మృతి చెందారనే కనీస మానవత్వం మరిచి సబ్బులు ఎత్తుకు వెళ్లడం గమనార్హం.

Exit mobile version