Site icon aksharatoday.in

IRCTC Tour Package | కర్ణాటకలోని ప్రకృతి అందాలు చూసొద్దామా.. ఐఆర్​సీటీసీ మరో సూపర్​ ప్యాకేజీ..

IRCTC

IRCTC Tour Package | కర్ణాటకలోని ప్రకృతి అందాలు చూసొద్దామా.. ఐఆర్​సీటీసీ మరో సూపర్​ ప్యాకేజీ..

అక్షరటుడే, వెబ్​డెస్క్: IRCTC Tour Package | వర్షాకాలం వచ్చిందంటే అడవులు పచ్చదనంతో కళకళలాడతాయి. జలపాతాలు తమ హొయలతో కట్టి పడేస్తాయి. చల్లని వాతావరణంలో పచ్చని అడవుల్లో విహరిస్తుంటే ఆ ఆనందమే వేరు. దీంతో ఎంతో మంది ప్రకృతి ప్రేమికులు(Nature lovers) వర్షాకాలంలో టూర్లకు వెళ్తుంటారు. వారి కోసం ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

కర్ణాటకలోని కూర్గ్‌(Karnataka Coorg) వర్షాకాలంలో చూడదగిన ప్రాంతాల్లో ముఖ్యమైనది. కూర్గ్​ అటవీ ప్రాంతంలో పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. జలపాతాలు తమ సవ్వడితో పర్యాటకులను(Tourists) కట్టిపడేస్తాయి. కాఫీ తోటలు, చారిత్రక కట్టడాలు కూడా ఇక్కడ ఉంటాయి. కూర్గ్​ అందాలను చూడడానికి ‘కాఫీ విత్‌ కర్ణాటక’ (Coffee with Karnataka) ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ(IRCTC) తీసుకొచ్చింది. ఈ ప్రకృతి అందాలు చూడాలనుకునే వారి కోసం ప్రతి బుధవారం కాచిగూడ నుంచి రైలు ఉంటుంది. జూలై 2 నుంచి ఆగస్టు 27 వరకు ప్రత్యేక రైలు(Special train) అందుబాటులో ఉండనుంది. ఈ టూర్​ ప్యాకేజీ ధర రూ.12,670 నుంచి ప్రారంభమవుతుంది. కాచిగూడ, జడ్చర్ల, గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, కర్నూలు సిటీ, డోన్‌ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

IRCTC Tour Package | టూర్​ వివరాలు..

ఐఆర్​సీటీసీ కాఫీ విత్​ కర్ణాటక టూర్​ ఆరు రోజులు ఉంటుంది. కాచిగూడ(Kachiguda) నుంచి రైలు బుధవారం రాత్రి 7.05 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం పర్యాటకులు మైసూరు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఆర్‌సీటీసీ సిబ్బంది పర్యాటకులను కూర్గ్​ అటవీ ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడ అందమైన అబ్బె జలపాతం, ఓంకారేశ్వర ఆలయాన్ని(Omkareshwara Temple) సందర్శించవచ్చు. మూడో రోజు రాజా సీట్‌ పార్క్‌, తలకావేరి, భాగమండల ప్రాంతాలను చూపిస్తారు. నాలుగో రోజు మైసూర్​కు తీసుకు వెళ్తారు. టిబెటెన్‌ మానెస్టరీ, బృందావనం గార్డెన్స్‌, కావేరి నిసర్గధామ సందర్శించొచ్చు. ఐదో రోజు చాముండి హిల్స్‌(Chamundi Hills), మైసూర్‌ ప్యాలెస్‌(Mysore Palace) చూపిస్తారు. అనంతరం మైసూరు నుంచి కాచిగూడకు ట్రెయిన్​ బయలు దేరుతుంది. ఆరో రోజు ఉదయం పర్యాటకులు కాచిగూడ చేరుకుంటారు.

IRCTC Tour Package | ధరల వివరాలు..

కాఫీ విత్​ కర్ణాటక టూర్​ ప్యాకేజీలో వివిధ రేట్లను ఐఆర్​సీటీసీ అందుబాటులో ఉంచింది. థర్డ్‌ ఏసీ బెర్త్‌ సింగిల్‌ షేరింగ్‌లో రూ.33,160, డబుల్‌ షేరింగ్‌కు రూ.18,730, ట్రిపుల్‌ షేరింగ్‌ మూమ్​ అయితే రూ.14,690 చెల్లించాలి. 5-11 ఏళ్ల చిన్నారులకు విత్‌ అవుట్‌ బెడ్‌కు రూ.9,530, విత్‌ బెడ్‌ అయితే రూ.11,140 టికెట్​ ధర ఉంటుంది.

స్లీపర్‌ బెర్త్‌లో సింగిల్‌ షేరింగ్‌లో అయితే రూ.31,140, డబుల్‌ షేరింగ్‌కు రూ.16,710, ట్రిపుల్‌ షేరింగ్‌లో రూ.12,670గా రేట్లు ఉన్నాయి. 5-11 ఏళ్ల చిన్నారులకు విత్‌ బెడ్‌కు రూ.9,120, బెడ్‌ లేకుండా రూ.7,510 చెల్లించి టూర్​కు వెళ్లొచ్చు.

ప్యాకేజీలో భాగంగా కర్ణాటకలో మూడు రాత్రులు ఉండడానికి గదులు, ఉదయం అల్పాహారం ఐఆర్​టీసీ ఆధ్వర్యంలోనే ఏర్పాటుచేస్తారు. టోల్‌, పార్కింగ్‌ ఛార్జీలు వంటివి ప్యాకేజీలో భాగమే. అయితే మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రయాణికులే చూసుకోవాల్సి ఉంటుంది.

Exit mobile version