Site icon aksharatoday.in

Gadwal | తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్​.. వెలుగులోకి కీలక విషయాలు

Gadwal

Gadwal | తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్​ .. వెలుగులోకి కీలక విషయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gadwal | గద్వాల జిల్లాకు చెందిన సర్వేయర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువతి పెళ్లయిన నెలరోజులకే కట్టుకున్న వాడిని కడతేర్చింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన బ్యాంక్​ మేనేజర్​(bank manager)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్​ చేశారు.

గద్వాలకు చెందిన తేజేశ్వర్​కు (Tejeshwar) ఏపీలోని కర్నూల్​కు చెందిన ఐశ్వర్యతో మే 17న వివాహం జరిగింది. అయితే ఆమెకు గతంలోనే కర్నూల్​లోని (Kurnool) ఓ బ్యాంక్​ మేనేజర్​తో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లయిన తర్వాత ప్రియుడితో కలిసి తేజేశ్వర్​ను చంపడానికి ప్రణాళిక వేసింది. ఇందులో భాగంగా బ్యాంక్​ మేనేజర్​ తిరుమల రావు రూ.రెండు లక్షలు ఇచ్చి పరశురామ్, రాజు, నగేష్ అనే వ్యక్తులతో తేజేశ్వర్​ను హత్య చేయించాడు. అయితే ఈ కేసులో హత్య చేసిన నిందితులతో పాటు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు ఇదివరకే అరెస్ట్​ చేశారు. ప్రధాన నిందితుడైన బ్యాంక్​ మేనేజర్​ తిరుమలరావును హైదరాబాద్​లో (Hyderabad) అదుపులోకి తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున సుపారీ గ్యాంగ్‌తో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయించారు.

Gadwal | విదేశాల్లో సెటిల్​ అవ్వాలని ప్లాన్​

బ్యాంక్​ మేనేజర్​ తిరుమల రావుకు (Bank manager Tirumala Rao) గతంలోనే వివాహం అయింది. అయితే వారికి పిల్లలు కాలేదు. దీంతో ఆయన ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్​ వేశాడు. దీనికోసం తన భార్యను సైతం చంపాలనుకున్నాడు. తన భార్యను, తేజేశ్వర్​ను చంపి తిరుమల రావు, ఐశ్వర్య విదేశాల్లో సెటిల్ అవ్వాలని ప్లాన్​ చేశారు. అంతేకాదు వారు టికెట్లు కూడా బుక్​ చేసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం రూ.20 లక్షల లోన్​ తీసుకున్న తిరుమల రావు అందులో నుంచి రూ.రెండు లక్షలు ఇచ్చి తేజేశ్వర్​ను హత్య చేయించాడు. మిగతా రూ.18 లక్షలు సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.

Gadwal | ఐశ్వర్య అన్నను కూడా చంపారా..

తిరుమల రావు పనిచేసే బ్యాంక్​లో ఐశ్వర్య తల్లి సుజాత స్వీపర్​గా పని (sweeper work) చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనంతరం ఐశ్వర్యతో కూడా ఆయన వివాహేతర సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలని ప్లాన్​ చేశాడు. అయితే తన తల్లి, చెల్లికి తిరుమలరావుతో ఉన్న సంబంధం నచ్చక పలుమార్లు వారిని ఐశ్వర్య అన్న నవీన్ మందలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల ఇంట్లో జారిపడి నవీన్​ మరణించినట్లు ఐశ్వర్య, సుజాత తెలిపారు. అయితే ఆయన మృతిపై కూడా పోలీసులు (Police) అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బంధానికి అడ్డు వస్తున్నాడని తిరుమలరావు, ఐశ్వర్య, సుజాత అతడి చంపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.

Exit mobile version