Site icon aksharatoday.in

EX Mla Jeevan Reddy | రైతుల కష్టాలు తీర్చిన ప్రాజెక్ట్​ కాళేశ్వరం

EX Mla Jeevan Reddy

EX Mla Jeevan Reddy | రైతుల కష్టాలు తీర్చిన ప్రాజెక్ట్​ కాళేశ్వరం

అక్షరటుడే, ఆర్మూర్​: EX Mla Jeevan Reddy | తెలంగాణ రైతుల కష్టాలు తీర్చిన ప్రాజెక్ట్ కాళేశ్వరం అని బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి పేర్కొన్నారు. ​కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) ద్వారా నీటి విడుదల జరిగి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ (KCR) అపర భగీరథ యత్నానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని పేర్కొన్నారు. కాళేశ్వరం గురించి అవగాహన లేని కాంగ్రెస్​, బీజేపీలు ప్రాజెక్ట్​పై విషం కక్కుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మహా జలశక్తి పీఠమని, దేశానికే మార్గదర్శకం చేసిన సాగునీటి పాఠమని జీవన్ రెడ్డి అభివర్ణించారు.

EX Mla Jeevan Reddy | హామీల అమలులో కాంగ్రెస్​ విఫలం

కాళేశ్వరం ద్వారా కేసీఆర్ సాగునీటిని పారిస్తే, కాంగ్రెస్ విషం పారిస్తోందని జీవన్​రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగిస్తున్న కాంగ్రెస్​ పార్టీ.. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్​ పాలిటిక్స్​ చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతిని అంటగట్టి కేసీఆర్​కు నోటీసులు ఇచ్చి అవమానించిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.

Exit mobile version