అక్షరటుడే, వెబ్డెస్క్ :Shapoornagar | మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్స్టేషన్(Jeedimetla Police Station) పరిధిలోని షాపూర్నగర్లో మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ కలకలం సృష్టిస్తోంది.
ఏకంగా మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడినే చంపుతామని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్(Former MLA Kuna Srisailam Goud) సోదరుడి కొడుకు రాఘవేందర్గౌడ్కు బెదిరింపు లేఖ రాశారు.
రూ.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే రాఘవేందర్గౌడ్ను చంపుతామని అందులో ఉంది. డబ్బు ఇవ్వకపోతే ఆయన ఇళ్లను బాంబులతో పేల్చేస్తామని పేర్కొన్నారు. ఇంటి ముందు వస్తువులను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తి, లెటర్ పెట్టి వెళ్లినట్లు సీసీ కెమెరా(CC Camera)లో రికార్డయింది. ఈ మేరకు రాఘవేందర్గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.