అక్షరటుడే నిజాంసాగర్: Mahammad Nagar | విద్యుదాఘాతంతో కిరాణాషాప్ దగ్ధమైన ఘటన మహమ్మద్నగర్లో బుధవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గాలీపూర్ (mohammad nagar mandal Galipur) గ్రామానికి చెందిన గంజి రాజు కిరాణా దుకాణంలో విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు లేచాయి. మంటలు వేగంగా దుకాణమంతా వ్యాపించడంతో క్షణాల్లోనే షాప్ దగ్ధమైంది. స్థానికులు స్పందించి నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు దుకాణాదారుడు తెలిపాడు.