ePaper
More
    HomeతెలంగాణRythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా పడేది అప్పుడే!

    Rythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా పడేది అప్పుడే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Rythu Bharosa | వానాకాలం సాగుకు సిద్ధం అవుతున్న రైతులకు (Farmers) ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. త్వరతో రైతు భరోసా (Rythu Bharosa) జమ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) కీలక ప్రకటన చేశారు. ఈ నెల 25లోపు రైతు భరోసా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ నెల 16 నుంచి రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

    Rythu Bharosa | జోరుగా సాగు పనులు

    ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. దీంతో రైతులు సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. మరో 15 రోజుల్లో వరినాట్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం (Government) సకాలంలో డబ్బులు విడుదల చేస్తే పెట్టుబడికి ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు.

    Rythu Bharosa | ముందు వారికే..

    రైతు భరోసాకు నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్​బీఐ నుంచి అప్పు తీసుకున్న ప్రభుత్వం.. మరో రూ.మూడు వేల కోసం ఇండెంట్​ పెట్టింది. ఈ క్రమంలో రైతు భరోసా జమ చేయడానికి ఆర్థిక శాఖ (Finance Department) సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ముందుగా ఎకరాలోపు రైతులకు నిధులు జమ చేయనున్నారు. అనంతరం రెండు, మూడు ఎకరాలలోపు రైతులకు విడతల వారీగా రైతు భరోసా జమ చేయనున్నారు.

    Rythu Bharosa | వారి పరిస్థితి ఏమిటి?

    ప్రభుత్వం యాసంగి సీజన్​లో రైతు బంధును రైతు భరోసాగా మార్చింది. ఎకరాకు గతంలో రూ.5వేలు ఇస్తుండగా రూ.ఆరు వేలకు పెంచింది. అయితే యాసంగి సీజన్​లో నాలుగు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా జమ అయింది. మిగతా వారికి నిధులు జమ చేయలేదు. యాసంగి సీజన్​లో 57 లక్షల రైతులకు 84 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.5,058 కోట్లను పంపిణీ చేసింది. బీఆర్ఎస్​ హయాంలో ఎకరాకు రూ.5 వేల చొప్పున సీజన్​కు రూ.7,500 కోట్లు రైతుబంధు ఇచ్చేవారు. కాంగ్రెస్​ మాత్రం సాయాన్ని పెంచిన రూ.5,058 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వేసింది. దీంతో డబ్బులు జమకాని రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్​ రైతు భరోసాకు విడుదలకు ప్రభుత్వం సిద్ధం అవుతుండటంతో ముందుగా తమకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

    Rythu Bharosa | కొత్త రైతులకు అవకాశం

    కొత్తగా జూన్ ​5లోపు పట్టాపాస్​బుక్​ పొందిన రైతలకు కూడా రైతు భరోసా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రైతు భరోసా రాకుండా కొత్త పాస్​బుక్​ పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచింది. దీంతో వ్యవసాయ అధికారులు వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే బ్యాంక్​ అకౌంట్​ మార్చుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రైతు భరోసా(Rythu Bharosa) జమ అయిన వారు దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

    Latest articles

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    More like this

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...