More
    HomeతెలంగాణRythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా పడేది అప్పుడే!

    Rythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా పడేది అప్పుడే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Rythu Bharosa | వానాకాలం సాగుకు సిద్ధం అవుతున్న రైతులకు (Farmers) ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. త్వరతో రైతు భరోసా (Rythu Bharosa) జమ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) కీలక ప్రకటన చేశారు. ఈ నెల 25లోపు రైతు భరోసా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ నెల 16 నుంచి రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

    Rythu Bharosa | జోరుగా సాగు పనులు

    ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. దీంతో రైతులు సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. మరో 15 రోజుల్లో వరినాట్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం (Government) సకాలంలో డబ్బులు విడుదల చేస్తే పెట్టుబడికి ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు.

    READ ALSO  Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. 8 ప్రత్యేక రైళ్లు

    Rythu Bharosa | ముందు వారికే..

    రైతు భరోసాకు నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్​బీఐ నుంచి అప్పు తీసుకున్న ప్రభుత్వం.. మరో రూ.మూడు వేల కోసం ఇండెంట్​ పెట్టింది. ఈ క్రమంలో రైతు భరోసా జమ చేయడానికి ఆర్థిక శాఖ (Finance Department) సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ముందుగా ఎకరాలోపు రైతులకు నిధులు జమ చేయనున్నారు. అనంతరం రెండు, మూడు ఎకరాలలోపు రైతులకు విడతల వారీగా రైతు భరోసా జమ చేయనున్నారు.

    Rythu Bharosa | వారి పరిస్థితి ఏమిటి?

    ప్రభుత్వం యాసంగి సీజన్​లో రైతు బంధును రైతు భరోసాగా మార్చింది. ఎకరాకు గతంలో రూ.5వేలు ఇస్తుండగా రూ.ఆరు వేలకు పెంచింది. అయితే యాసంగి సీజన్​లో నాలుగు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా జమ అయింది. మిగతా వారికి నిధులు జమ చేయలేదు. యాసంగి సీజన్​లో 57 లక్షల రైతులకు 84 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.5,058 కోట్లను పంపిణీ చేసింది. బీఆర్ఎస్​ హయాంలో ఎకరాకు రూ.5 వేల చొప్పున సీజన్​కు రూ.7,500 కోట్లు రైతుబంధు ఇచ్చేవారు. కాంగ్రెస్​ మాత్రం సాయాన్ని పెంచిన రూ.5,058 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వేసింది. దీంతో డబ్బులు జమకాని రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్​ రైతు భరోసాకు విడుదలకు ప్రభుత్వం సిద్ధం అవుతుండటంతో ముందుగా తమకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

    READ ALSO  Malreddy Ranga Reddy | మల్​రెడ్డి రంగారెడ్డిని కలిసిన మంత్రి శ్రీధర్​బాబు

    Rythu Bharosa | కొత్త రైతులకు అవకాశం

    కొత్తగా జూన్ ​5లోపు పట్టాపాస్​బుక్​ పొందిన రైతలకు కూడా రైతు భరోసా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రైతు భరోసా రాకుండా కొత్త పాస్​బుక్​ పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచింది. దీంతో వ్యవసాయ అధికారులు వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే బ్యాంక్​ అకౌంట్​ మార్చుకోవాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రైతు భరోసా(Rythu Bharosa) జమ అయిన వారు దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

    Latest articles

    Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం ధ‌ర‌లు.. ఏకంగా ల‌క్ష మార్కు దాటేసిందిగా..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఉలిక్కిప‌డేలా చేస్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా...

    Helicopter crash | చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు దుర్మరణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: helicopter crash | అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం ఎంత మందిని పొట్ట‌న బెట్టుకుందో ప్ర‌త్యేకంగా...

    Yoga | యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yoga | యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా తయారవుతాం. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాలు...

    Yoga | యోగాకు ముందు సూక్ష్మ వ్యాయామం తప్పనిసరి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Exercise | యోగా(Yoga) సాధన శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత ఇస్తుంది. నిత్యం యోగా చేస్తే...

    More like this

    Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం ధ‌ర‌లు.. ఏకంగా ల‌క్ష మార్కు దాటేసిందిగా..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఉలిక్కిప‌డేలా చేస్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా...

    Helicopter crash | చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు దుర్మరణం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: helicopter crash | అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం ఎంత మందిని పొట్ట‌న బెట్టుకుందో ప్ర‌త్యేకంగా...

    Yoga | యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yoga | యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా తయారవుతాం. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాలు...