More
    HomeజాతీయంPahalgam terror attack | పహల్​గామ్​ ఉగ్రదాడిలో పాక్ మాజీ జవాన్.. ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడి

    Pahalgam terror attack | పహల్​గామ్​ ఉగ్రదాడిలో పాక్ మాజీ జవాన్.. ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pahalgam terror attack | పహల్​గామ్​ ఊచకోత వెనుక ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాది హషీమ్ ముసా(Terrorist Hashim Musa) గతంలో పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్(Pakistan Army Special Forces)​లో మాజీ పారా కమాండోగా పని చేసినట్లు దర్యాప్తులో తేలింది.

    పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)తో ముసా చేతులు కలిపాడని వెల్లడైంది. కాశ్మీర్​కు వచ్చే స్థానికేతరులు, భద్రతా దళాలపై దాడులు చేయాలన్న నిర్దిష్ట లక్ష్యంతో మూసాను ఎల్ఈటీ కాశ్మీర్​కు పంపిందని నిఘా వర్గాలు గుర్తించాయి. “స్పెషల్ సర్వీస్ గ్రూప్(SSG) వంటి పాకిస్తాన్ ప్రత్యేక దళాలు అతన్ని ఎల్ఈటీ(LET)కి అనుబంధంగా పని చేయమని చెప్పి ఉండవచ్చని” భద్రతా సంస్థ అధికారి ఒకరు తెలిపారు.

    SSG పారా-కమాండోలు అసాధారణ యుద్ధంలో అత్యంత కఠిన శిక్షణ పొందారు. రహస్య కార్యకలాపాలలో వారికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. స్థానికుల్లో కలిసి పోవడం, దాడి చేసి క్షణాల్లో మాయం కావడం, ప్రతికూలతను ఎదుర్కొంటూ అవకాశాలు సృష్టించుకోవడంలో వారికి శిక్షణ ఇస్తారు. SSG కమాండోలు అధునాతన ఆయుధాల వాడకంలో శిక్షణ పొందారు.

    READ ALSO  Gautam Adani | ఆసియాలోని అతిపెద్ద స్లమ్‌ ఏరియా ఆధునిక టౌన్‌షిప్‌గా మారనుంది..: గౌతమ్‌ అదానీ

    Pahalgam terror attack | పాకిస్తాన్ పాత్ర నిర్ధారణ..

    పహల్​గామ్​ దాడి(Pahalgam terror attack) దర్యాప్తులో కీలక అనుమానితులుగా తేలిన 15 మంది కాశ్మీర్ ఓవర్​ గ్రౌండ్​ వర్కర్స్ (OGWs) ను ప్రశ్నించినప్పుడు, ముసా పాకిస్తాన్ ఆర్మీ నేపథ్యం బయటకు వచ్చిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వారు పాకిస్తాన్ దుండగులకు లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడంతో భద్రతా బలగాల కదలికలపై సమాచారం ఇచ్చారన్నారు. పహల్​గామ్​ ఉగ్రవాద దాడిలో ISI పాత్రకు, కాశ్మీర్​లో మునుపటి దాడులకు ఇది సాక్ష్యంగా మారిందన్నారు. అక్టోబర్ 2024లో గంగాంగిర్, గండర్బాల్లో జరిగిన ఉగ్ర దాడుల్లో 6 మంది స్థానికేతరులు, ఒక డాక్టర్ మరణించారు.

    బుటా పత్రి, బారాముల్లా(Baramulla)లో జరిగిన ఉగ్రవాద దాడులు ఇద్దరు ఆర్మీ సిబ్బంది, ఇద్దరు ఆర్మీ పోర్టర్లు(Army porters) మరణించారు. ఈ మూడు దాడులలోనూ మూసా హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్​లో శిక్షణ పొందిన మరో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు జునైద్ అహ్మద్ భట్, అర్బాజ్ మీర్ కూడా గగంగీర్ బూటా పత్రి దాడుల్లో పాల్గొన్నప్పటికీ, 2024 నవంబర్, డిసెంబర్లలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్​కౌంటర్లలో హతమయ్యారు. అప్పటి నుంచి కాశ్మీర్​లోని స్థానికేతరులను లక్ష్యంగా చేసుకునే మూసా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.

    READ ALSO  Shaktipeeth Expressway | రూ.20 వేల కోట్ల‌తో శ‌క్తిపీఠ్ ఎక్స్‌ప్రెస్ వే.. ఆమోదం తెలిపిన మ‌హారాష్ట్ర స‌ర్కారు

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 1 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – మంగళవారంమాసం – ఆషాఢపక్షం...

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...

    Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం...

    IGP Satyanarayana | ట్రబుల్ షూటర్​ ఐజీ సత్యనారాయణ పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన డీజీపీ జితేందర్​

    అక్షరటుడే, హైదరాబాద్: IGP Satyanarayana : పోలీస్ శాఖలో “ట్రబుల్ షూటర్” “troubleshooter IGP”గా ఖ్యాతి గాంచిన IGP...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 1 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – మంగళవారంమాసం – ఆషాఢపక్షం...

    Mla Laxmi Kantha Rao | రేవంత్​రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ

    అక్షరటుడే, బిచ్కుంద: Mla Laxmi Kantha Rao | సీఎం నాయకత్వలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని...

    Delhi | కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం అందించకుండా చర్యలు : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : దేశ రాజధాని(National Capital)లో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కాలం...