అక్షరటుడే, కోటగిరి: Paddy Centers | ధాన్యం కొనుగోళ్ల తీరును నిరసిస్తూ రైతులు(Farmers protes) రాస్తారోకో చేశారు. ఈ ఘటన కోటగిరి మండల kotagiri mandal మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా(Ambedkar Chowrasta kotagiri) వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు.
ఎత్తోండ సహకారం సంఘం(Etthonda Cooperative Society) పరిధిలోని రైతులు, గన్నీ సంచులు, హమాలీల కొరత తీవ్రంగా ఉందని, ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో సమస్యల పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు(kotagiri Police) ఘటనా స్థలానికి చేరుకుని సముదాయించడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ గంగాధర్(kotagiri Tahsildar Gangadhar)తో వాగ్వాదానికి దిగారు. కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.