అక్షరటుడే, వెబ్డెస్క్ : Ajit Doval | ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పిలుపునిచ్చారు. మంగళవారం చైనాలో (China) జరిగిన SCO సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, సీమాంతర ఉగ్రవాదంతో సహా ఏదైనా ఉగ్రవాద చర్య మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరమని అన్నారు. ఉగ్రవాదం (Terrorism), వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఉమ్మడి సమాచార ఆపరేషన్ కు ఆయన పిలుపునిచ్చారు. సరిహద్దు సీమాంతర ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేవారిని జవాబుదారీగా ఉంచాలని డిమాండ్ చేశారు. సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలని పిలుపునిచ్చారు.
Ajit Doval | ఉగ్రవాదులను నియంత్రించేందుకే ఆపరేషన్ సిందూర్..
నిషేధిత లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM), అల్ ఖైదా, ఐసిస్, దాని అనుబంధ సంస్థల నుంచి కొనసాగుతున్న ముప్పు గురించి భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని ధోవల్ తెలిపారు. పహల్గామ్ లో జరిగిన దాడిలో (Pahalgam Attack) ఎల్ఈటీ అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్.. మతం ఆధారంగా 26 మందిని హతమార్చిందని తెలిపారు. దీనికి ప్రతిగా ఇండియా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి ఆపరేషన్ సిందూర్ ను (Operation Sindoor) ప్రారంభించిందని వివరించారు. మరోసారి ఉగ్రవాదులు దాడులు (terrorist Attack) చేయకుండా ఉండడానికి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నేలమట్టం చేశామని చెప్పారు. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేశామన్నారు.
Ajit Doval | పరస్పర సహకారం అవసరం..
ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాద సంస్థలు ఎల్ఈటీ, జైషే మహమ్మద్, వారి ప్రాక్సీలపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధోవల్ స్పష్టం చేశారు. ఈ గ్రూపుల ఉగ్రవాద మౌలిక సదుపాయాలను. వారి ఉగ్రవాద పర్యావరణ వ్యవస్థలను (terrorist infrastructure) కూల్చివేయాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఉమ్మడి సమాచార ఆపరేషన్ కోసం అవసరమన్నారు.