అక్షరటుడే, వెబ్డెస్క్: Dengue | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. విషజ్వరాలతో అనేక మంది మంచం పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు (Private hospitals) పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. కాగా.. ఇటీవల కామారెడ్డి జిల్లా (Kamareddy district) పాల్వంచ మండలం భవానిపేట పరిధిలోని కిసాన్ నగర్లో 20 మందికి డెంగీ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
నిజాంసాగర్ మండలం వడ్డేపల్లిలో 14 ఏళ్ల బాలుడికి డెంగీ సోకింది. కాగా.. తాజాగా నిజామాబాద్ జిల్లా (Nizamabad district) మోపాల్ మండలం కాల్పోల్ తండాలో డెంగీ (Dengue) విజృంభిస్తోంది. పదుల సంఖ్యలో ప్రజలు డెంగీ లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో వైద్య సిబ్బంది శనివారం గ్రామంలో శిబిరం ఏర్పాటు చేశారు. జ్వరాలతో బాధ పడుతున్న 30 మంది శాంపిల్స్ తీసుకున్నారు. నలుగురు అనుమానిత శాంపిళ్లను ల్యాబ్కు పంపించారు. కాగా.. డెంగీ లక్షణాలతో నిజామాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో గ్రామానికి చెందిన 30 వరకు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వైద్య శిబిరంలో డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ రాథోడ్, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ అజ్మత్, గ్రామస్తులు ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.