Site icon aksharatoday.in

Viral incident | ఫుడ్ అడిగినందుకు మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కోడలు

Viral incident

Viral incident | ఫుడ్ అడిగినందుకు మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కోడలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Viral incident | నానాటికి వివాహ బంధానికి బీటలు వారుతున్నాయి. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు, వరకట్న వేధింపులు, ఇతర సమస్యలతో భార్యాభర్తలు ఒకరిపై మరొకరు పగతో రగిలిపోతున్నారు. ఈ క్ర‌మంలో వారి వారి కుటుంబ స‌భ్యుల మ‌ధ్య కూడా ప‌గ ప్ర‌తీకారాలు ఎక్కువ అవుతున్నాయి. సొంత మామ‌ని నిలువునా మంటల్లో తగలబెట్టేసిన మహాఇల్లాలి బాగోతం తాజాగా వెలుగుచూసింది. ఈ అమానుష ఘటన ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కాని, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్​గా మారింది. అయితే అదృష్టం బాగుండి ఆ మామ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌ట్టాడు.

Viral incident | అమానుషం..

ఆహారం అడిగిన మామపై కోడలు పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన హృదయవిదారక ఘటన తమిళనాడు(Tamilnadu)లో జరిగిందని తెలుస్తోంది. ఈ అమానుష చర్య స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన ఓ వృద్ధుడు గత కొంతకాలంగా తన కుమారుడు, కోడలితో కలిసి నివసిస్తున్నాడు. శారీరకంగా బలహీనంగా ఉండే అతడు దినసరి అవసరాల కోసం ఇతరులపై ఆధారపడేవాడు. ఆదివారం రాత్రి అతడు తన కోడలిని ఆహారం కావాలంటూ అడిగాడు. అయితే ఆమెకు కోపం వచ్చి గొడవ పెట్టుకుంది. ఆపై పెట్రోల్(Petrol) పోసి నిప్పు పెట్టినట్లు సమాచారం.

వృద్ధుడు ఆ మంట‌తో కేకలు వేశాడు. స్థానికులు స్పందించి వెంటనే అతన్ని హాస్పిటల్‌(Hospital)కు తరలించారు. ప్రస్తుతం అతని ముఖం అంతా కాలిపోయింది. ప్రాణానికి పెద్ద ప్ర‌మాదం ఏమి లేద‌ని వైద్యులు అంటున్నారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు(Tamilnadu Police) కోడలిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

Exit mobile version