Site icon aksharatoday.in

CM Revanth Reddy | హైదరాబాద్​లో డేటా సిటీ ఏర్పాటు : సీఎం రేవంత్​రెడ్డి

CM-Revanth-Reddy

Chief Minister Revanth Reddy | కల్తీ, నకిలీ విత్తనాల దందా చేస్తే పీడీ యాక్టు : సీఎం రేవంత్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | హైదరాబాద్​(Hyderabad)లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. శుక్రవారం ఆయన విద్యుత్‌ శాఖపై సమీక్ష నిర్వహించారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్​లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏ(HMDA)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందన్నారు. భవిష్యత్​లో డిమాండ్​ భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందని అంచనా వేశారు.

CM Revanth Reddy | విద్యుత్​ స్తంభాలు కనిపించొద్దు

విద్యుత్ డిమాండ్​కు అనుగుణంగా సబ్ స్టేషన్లను(Substations) అప్ గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యుత్ లైన్ల ఆధునీకరణపైనా దృష్టి సారించాలన్నారు. త్వరలో నిర్మించనున్న ఫ్యూచర్ సీటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని సీఎం(CM) ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించొద్దని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version