అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy) ఇది రెండో ప్రజావాణి. అయితే సోమవారం ఏకంగా 217 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar), ట్రైయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి (Trainee Collector Caroline Chingtianmavi), డీఆర్డీవో సాయాగౌడ్, ఇన్ఛార్జి డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్ వినతులను స్వీకరించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Prajavani | ప్రజావాణికి పోటెత్తిన ఫిర్యాదులు

Prajavani | ప్రజావాణికి పోటెత్తిన ఫిర్యాదులు