Site icon aksharatoday.in

Kukatpally | పాలు పగిలిపోయాయని పోలీసులకు ఫిర్యాదు

Kukatpally

Kukatpally | పాలు పగిలిపోయాయని పోలీసులకు ఫిర్యాదు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kukatpally | ఓ సినిమాలో తన పెన్సిల్​ పోయిందని ఓ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఇటీవల ఓ బాలుడు తాను కొనుగోలు చేసిన బొమ్మ హెలికాప్టర్​ పని చేయడం లేదని పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా ఇలాంటి వింత కేసు కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్(Kukatpally Police Station)​లో నమోదైంది. పాలు పగిలిపోయానని(Milk Spilling) ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కూకట్‌పల్లి(Kukatpally) ఠాణా పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌(Ratnadeep Supermarket)లో ఓ వ్యక్తి రెండు హెరిటేజ్​(Heritage) పాల ప్యాకెట్లు కొనుగోలు చేశాడు. అయితే అందులో ఓ ప్యాకెట్​ పాలు వేడి చేయగానే పగిలిపోయాయి. దీంతో ఆ వ్యక్తి సూపర్​మార్కెట్​కు వెళ్లి ప్రశ్నించారు. అయితే తమకు దాంతో సబంధం లేదని నిర్వాహకులు తెలిపారు. దీంతో అసంతృప్తికి గురైన బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పాలు పగిలిపోయాయనే ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అరె పెద్ద సమస్యే వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరేమో ఇటీవల తరుచూ పాలు పగిలిపోతున్నాయని, ప్యాకెట్లలో పాలు వాసన వస్తున్నాయని అంటున్నారు. ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Exit mobile version