అక్షరటుడే, వెబ్డెస్క్: Prashanth Reddy | మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP), రేవంత్రెడ్డి (CM Revanth Reddy)ఒక్కటే అని ఆయన ఆరోపించారు. వాళ్లిద్దరి స్నేహం చాలా సార్లు బయటపడిందని ఆయన పేర్కొన్నారు.
ఏడుగురు బీజేపీ ఎంపీ(BJP MP)లను రేవంత్రెడ్డి గెలిపించారని ఆయన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ను బొంద పెట్టడమే రేవంత్ రెడ్డి లక్ష్యమని ప్రశాంత్రెడ్డి అన్నారు. బీజేపీ ఎంపీలు గెలిచిన చోట మంత్రి పదవులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. రేవంత్పై బీజేపీ ఈగ కూడా వాలనివ్వడం లేదని విమర్శించారు. రేవంత్ ఢిల్లీ(Delhi) వెళ్తే రాహుల్ అపాయింట్మెంట్ దొరకదు కానీ ప్రధాని మోదీ(Prime Minister Modi) అపాయింట్మెంట్ దొరుకుతుందని ఆయన ఎద్దేవా చేశారు.