అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP | కాంగ్రెస్ congress ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్టుపై బీజేపీ bjp నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో తల లేని నేత ఫోటోను పెట్టి గాయబ్ అనే ట్యాగ్లైన్తో పోస్టు చేసింది. దీనిపై సోషల్ మీడియా social mediaలో పెద్ద రచ్చ జరుగుతుండగా బీజేపీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోదీ తల లేని ఫొటో పెట్టి అవమానించారని బీజేపీ మండిపడుతోంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు.. లష్కరే పాకిస్తాన్ కాంగ్రెస్ అంటూ ఆ పార్టీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల తీసే విధానం ఉగ్రవాదుల్లోనే ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ పోస్ట్పై బీజేపీ నేతలు ఢిల్లీ సీపీ Delhi CPకి ఫిర్యాదు చేశారు.