అక్షరటుడే, వెబ్డెస్క్ : Spying for Pak | పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్– పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్(Operatiom Sindoor)తో ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్కు బుద్ధి చెప్పింది. అనంతరం కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందం అమలులోకి రాగా భారత్ ఇంటిదొంగల పని పడుతోంది. భారత్లో ఉంటూ పాకిస్తాన్కు రహస్యాలను చేరవేస్తున్న వారిని నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
హిమచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని కాంగ్రా ప్రాంతానికి చెందిన అభిషేక్ భరద్వాజ్(20) పాకిస్తాన్కు భారత రహస్యాలను చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని గురువారం ఉదయం 4 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అభిషేక్ కాలేజీ డ్రాప్ అవుట్గా గుర్తించారు. కొన్ని వారాలుగా నిందితుడిపై నిఘా ఉంచిన అధికారులు పాకిస్తాన్కు రహస్యంగా సమాచారం అందిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అరెస్ట్ చేశారు.