అక్షరటుడే, హైదరాబాద్: Rain Alert | బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంది. దీనికితోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ Meteorological Department కీలక హెచ్చరిక జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా జులై 21, 22 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 12 జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
మిగతా జిల్లాలోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. గాలిదుమారం లేచే ప్రమాదం ఉందని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.
Rain Alert | ఆరెంజ్ అలెర్ట్లో ఉన్న జిల్లాలు..
ఆదిలాబాద్ (Adilabad), మంచిర్యాల (Mancherial), కుమురం భీమ్ ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad), మెదక్ (Medak), కామారెడ్డి (Kamareddy), కరీంనగర్ (Karimnagar), పెద్దపల్లి (Peddapalli),
హనుమకొండ (Hanumakonda), వరంగల్ (Warangal), జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally), నాగర్కర్నూల్ (Nagarkurnool), మహబూబ్నగర్ (Mahabubnagar).
Rain Alert | జులై 21న..
భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Rain Alert | జులై 22న..
కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rain Alert | ఇక్కడ సాధారణం..
నిజామాబాద్ (Nizamabad), నిర్మల్ (Nirmal), జగిత్యాల (Jagtial), సిద్దిపేట (Siddipet), సిరిసిల్ల (Sircilla), జనగాం (Jangaon), రంగారెడ్డి (Ranga Reddy), యాదాద్రి (Yadadri)తో పాటు.. మేడ్చల్ (Medchal), హైదరాబాద్ (Hyderabad), సంగారెడ్డి (Sangareddy), వికారాబాద్ (Vikarabad), వనపర్తి (Wanaparthy) జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.