అక్షరటుడే, వెబ్డెస్క్ : Israel | గాజా(Gaza)పై మరోసారి ఇజ్రాయెల్ (Israel) దాడులు చేసింది. శరణార్థులపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేశాయి. ఈ ఘటనలో 70 మందికిపైగా మృతి చెందగా.. 150 మందికి గాయాలయ్యాయి. ఉత్తర గాజాలో ఐక్యరాజ్యసమితి సహాయ లారీల కోసం వేచి ఉన్న కనీసం వారిపై ఇజ్రాయెల్ దాడి చేసిందని హమాస్ నిర్వహణలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్ దళాలు (IDF) ఆదివారం దేర్ అల్-బలా నగరంలో ఆశ్రయం పొందుతున్న నివాసితులు, పాలస్తీనియన్లు వెంటనే ఖాళీ చేసి మధ్యధరా తీరంలోని అల్-మవాసి వైపు వెళ్లాలని తెలిపాయి. అనంతరం ఆ ప్రాంతంలో వైమానిక దాడులు చేపట్టింది. ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేయడానికి దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.