అక్షరటుడే, వెబ్డెస్క్ :Bank Scam | అండమాన్, నికోబార్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ANSCBL) కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారీగా రుణ అవకతవకలకు పాల్పడినట్లు ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కుల్దీప్ రాయ్ శర్మ(Congress Former MP Kuldeep Roy Sharma)ను సీఐడీ శుక్రవారం అరెస్టు చేసింది.
గతంలో ANSCBL ఛైర్మన్గా పనిచేసిన శర్మను పోర్ట్ బ్లెయిర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అరెస్టు చేశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయనను సీఐడీ(CID) అదుపులోకి తీసుకుంది. “శర్మ కొన్ని ఆరోగ్య సమస్యలతో డాక్టర్ రితికా డయాగ్నస్టిక్ సొల్యూషన్స్ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. సీనియర్ అధికారుల నేతృత్వంలోని అధికారుల బృందం శుక్రవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లి అతన్ని అరెస్టు చేసింది” అని ఒక సీనియర్ పోలీసు అధికారి (Senior Police Officer) తెలిపారు. తదుపరి చర్యల కోసం అతడ్ని కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు. ఆస్పత్రిలో ఉంచాలా.. జైలుకు తరలించాలా? అన్నది మెడికల్ బోర్డు నిర్ణయిస్తుందన్నారు.
Bank Scam | సీఐడీ దూకుడు..
ఎలాంటి కనీస పరిశోధనలు లేకుండానే విచ్చలవిడిగా రుణాలు మంజూరు చేశారని ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు మేనేజింగ్ కమిటీ (Bank Managing Committee) రుణ స్క్రీనింగ్ కమిటీ సిఫార్సులను విస్మరించిందని, రుణాలు మంజూరు చేసేటప్పుడు సిబిల్ రిపోర్టు (CIBIL Report)తో పాటు తప్పనిసరి పత్రాలను విస్మరించిందని ఆరోపణలు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
బ్యాంకు కుంభకోణం (Bank scam)లో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారిస్తున్న సీఐడీ దూకుడు పెంచింది. 20 రోజుల వ్యవధిలోనే ఎనిమిది మందిని అరెస్టు చేసింది. వీరిలో ANSCBL మేనేజింగ్ డైరెక్టర్ మురుగన్, బ్యాంక్ ఉద్యోగి కలైవానన్, బబ్లు హల్దర్ (అండమాన్ మోర్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్), తరుణ్ మండల్ (బ్లెయిర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్), అజయ్ మింజ్ (వరుసగా అండమాన్ ట్రీపీ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్), కె సుబ్రమణియన్ (ANSCBL డైరెక్టర్) మరియు ఎం సాజిద్ (మెసర్స్ అండమాన్ ఎస్కేపేడ్స్ యజమాని) ఉన్నారు.