అక్షరటుడే, వెబ్డెస్క్: Traffic Police | నిత్యం రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా పలువురు ట్రాఫిక్ నిబంధనలు(Traffic Rules) పాటించడం లేదు. ముఖ్యంగా కొందరు యువకులు రోడ్డుపై ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్నారు. బైక్లు, కార్లతో స్టంట్లు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా ఇలాగే ఒకే వాహనంపై ఎనిమిది మంది యువకులు రోడ్డుపై వెళ్తూ హల్చల్ చేయగా.. వారికి పోలీసులు షాక్ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లోని రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్(Rajendranagar Traffic Police Station) పరిధిలోని గగన్పహాడ్ సమీపంలో ఒకే బైక్పై ఎనిమిది మంది యువకులు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వెళ్లారు. వెనకాల వెళ్తున్న ఓ వ్యక్తి వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్గా మారింది. దీంతో పోలీసులు స్పందించారు. దర్యాప్తు చేపట్టి బైక్పై వెళ్లిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. కాగా.. ఆ ఎనిమిది మందిలో కొందరు మైనర్లు ఉండడం గమనార్హం. ఒకే బైక్పై ఎనిమిది మంది వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.