Site icon aksharatoday.in

Traffic Police | ఒకే బైక్​పై 8 మంది యువకుల హల్​చల్​.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Traffic Police

Traffic Police | ఒకే బైక్​పై 8 మంది యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Traffic Police | నిత్యం రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా పలువురు ట్రాఫిక్​ నిబంధనలు(Traffic Rules) పాటించడం లేదు. ముఖ్యంగా కొందరు యువకులు రోడ్డుపై ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్నారు. బైక్​లు, కార్లతో స్టంట్లు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా ఇలాగే ఒకే వాహనంపై ఎనిమిది మంది యువకులు రోడ్డుపై వెళ్తూ హల్​చల్​ చేయగా.. వారికి పోలీసులు షాక్​ ఇచ్చారు.

రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లోని రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్(Rajendranagar Traffic Police Station) పరిధిలోని గగన్‌పహాడ్ సమీపంలో ఒకే బైక్‌పై ఎనిమిది మంది యువకులు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వెళ్లారు. వెనకాల వెళ్తున్న ఓ వ్యక్తి వారిని వీడియో తీసి సోషల్​ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్​గా మారింది. దీంతో పోలీసులు స్పందించారు. దర్యాప్తు చేపట్టి బైక్​పై వెళ్లిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. కాగా.. ఆ ఎనిమిది మందిలో కొందరు మైనర్లు ఉండడం గమనార్హం. ఒకే బైక్​పై ఎనిమిది మంది వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Exit mobile version