High Court | రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ మూవీ నిర్మాతలకు ఊరట

అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | సంక్రాంతికి విడుదల కానున్న రాజాసాబ్ (Raja Saab)​, మన శంకర వరప్రసాద్​ (Shankar Varaprasad) సినిమాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్​ రేట్ల పెంపునకు సంబంధించిన వినతులపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. ప్రభాస్​ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రాజాసాబ్​ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్​ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్​ సినిమా 11న విడుదల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | సంక్రాంతికి విడుదల కానున్న రాజాసాబ్ (Raja Saab)​, మన శంకర వరప్రసాద్​ (Shankar Varaprasad) సినిమాల నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్​ రేట్ల పెంపునకు సంబంధించిన వినతులపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది.

ప్రభాస్​ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రాజాసాబ్​ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్​ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్​ సినిమా 11న విడుదల కానుంది. పెద్ద సినిమాలు కావడంతో టికెట్ల రేట్లు పెంచాలని నిర్మాతలు కోరుతున్నాయి. అయితే ఇటీవల అఖండ–2 సినిమా టికెట్ల రేట్లను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా నిర్మాతలు డివిజన్​ బెంచ్​ను ఆశ్రయించారు.

High Court | ఆ సినిమాలకే పరిమితం

సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు డివిజన్​ బెంచ్​ ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు ఓజీ, గేమ్ ఛేంజర్, పుష్ప 2, అఖండ 2 సినిమాలకే వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీంతో రేట్ల పెంపు విషయంలో కోర్టు పరిధిలో ఈ రెండు సినిమాలకు ఇబ్బందులు లేవు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

High Court | మాట మీద నిలబడతారా..

పుష్ప–2 సినిమా ప్రీమియర్​ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో రాష్ట్రంలో మూవీ టికెట్ల రేట్లు పెంచమని గతంలో ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇటీవల పలు సినిమా టికెట్​ రేట్లను (Movie Ticket Prices) పెంచడానిక అనుమతించింది. అఖండ 2 సినిమా టికెట్​ ధరల పెంపునకు ఓకే చెప్పగా.. హైకోర్టు సింగిల్​ బెంచ్​ ఆ జీవోను కొట్టి వేసింది. దీంతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) మాట్లాడుతూ.. ఇక నుంచి తెలంగాణలో సినిమా టికెట్​ రేట్లను పెంచమని స్పష్టం చేశారు. నిర్మాతలు, సిని ప్రముఖులు టికెట్​ ధరలు పెంచాలని తమ దగ్గరకు రావొద్దని కోరారు. తమది ప్రజా ప్రభుత్వం, సామాన్యులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. మరి రాజాసాబ్​, మన శంకర వరప్రసాద్​ సినిమాల విషయంలో ప్రభుత్వం మాట మీద నిలబడుతుందా.. లేదా చూడాలి.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.