Minister Sridhar Babu | కొండాపూర్​లో ప్రారంభానికి సిద్ధంగా పరిశ్రమలు : మంత్రి శ్రీధర్​బాబు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Sridhar Babu | మెదక్ జిల్లాలోని (Medak district) కొండాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేసిన 36 పరిశ్రమల నిర్మాణం పూర్తయిందని మంత్రి శ్రీధర్​ బాబు (Sridhar Babu) తెలిపారు. అవి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ పరిశ్రమలతో సుమారు 5 వేల ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఎక్స్​ వేదికగా ప్రకటించారు. ఆయన సచివాలయంలో కొండపూర్ పారిశ్రామికవేత్తల సంఘం (Kondapur Industrialists Association) ప్రతినిధులతో బుధవారం సమావేశం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Sridhar Babu | మెదక్ జిల్లాలోని (Medak district) కొండాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేసిన 36 పరిశ్రమల నిర్మాణం పూర్తయిందని మంత్రి శ్రీధర్​ బాబు (Sridhar Babu) తెలిపారు. అవి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

ఈ పరిశ్రమలతో సుమారు 5 వేల ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఎక్స్​ వేదికగా ప్రకటించారు. ఆయన సచివాలయంలో కొండపూర్ పారిశ్రామికవేత్తల సంఘం (Kondapur Industrialists Association) ప్రతినిధులతో బుధవారం సమావేశం అయ్యారు. పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలను నెల రోజుల్లోగా పరిష్కరించాలని, జాతీయ రహదారికి అనుసంధాన రహదారి పనులను పూర్తి చేయాలని, మిగిలిన అన్ని మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Minister Sridhar Babu | 64 యూనిట్లలో..

పరిశ్రమల ప్రారంభంపై చర్చించడానికి టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్, ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయనున్న 64 యూనిట్లలో, 36 యూనిట్ల నిర్మాణం పూర్తయి, కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి శ్రీధర్​బాబు వెల్లడించారు. పారిశ్రామిక యూనిట్లను సకాలంలో ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పెట్టుబడుల డైరెక్టర్ మధుసూదన్, పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

BC Reservations Congress | కాంగ్రెస్​ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత..:​ ఈరవత్రి అనిల్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ అన్నారు.

Exam Center Security | పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఇంటర్​ పరీక్ష కేంద్రాల్లో మాల్​ ప్రాక్టీస్​కు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్​ పట్టణంలోని జూనియర్​ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు.

NCERT Book Ban | ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. పుస్తకంపై నిషేధం

ఎన్​సీఈఆర్​టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదో తరగతి సోషల్​ సైన్స్​ పుస్తకాన్ని నిషేధించింది.

Chain Snatching Kotagiri | కోటగిరిలో చైన్​స్నాచింగ్​.. మూడు తులాల గొలుసు అపహరణ..

జిల్లాలో వరుస చైన్​స్నాచింగ్​ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనే తేడాలేకుండా ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు.