Minister Uttam Kumar Reddy | అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్​ఎస్​ దిట్ట : మంత్రి ఉత్తమ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Uttam Kumar Reddy | అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్​ పార్టీ దిట్ట అని మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ (BRS chief KCR) సోమవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 90శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్​ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్​ స్పందించారు. పాలమూరు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Uttam Kumar Reddy | అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్​ పార్టీ దిట్ట అని మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ (BRS chief KCR) సోమవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 90శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్​ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్​ స్పందించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు (Palamuru Rangareddy project) సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేశాం అని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. ఆ ప్రాజెక్ట్​కు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి కనీసం ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదని విమర్శించారు.

Minister Uttam Kumar Reddy | అధిక వడ్డీకి అప్పులు

గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ దిట్ట అని మంత్రి అన్నారు. వాళ్లకే తెలివితేటలు ఉన్నట్లు, అవగాహన ఉన్నట్లు, గొప్పల సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మొత్తం బడ్జెట్ రూ.17.72 లక్షల కోట్లు అని చెప్పారు. ఇందులో ఇరిగేషన్​పై రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. అది కూడా అధిక వడ్డీకి అప్పులు తెచ్చారన్నారు. తక్కువ వ్యవధిలో ఆ లోన్లు కట్టేలా ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. దీంతో ఇరిగేషన్​కు సంబంధించి ప్రస్తుతం ఏటా రూ.16 వేల అప్పు కడుతున్నట్లు ఆయన తెలిపారు.

బీఆర్​ఎస్​ తీసుకొచ్చిన అప్పుల వల్ల ఎలాంటి ప్రయోజనం జరగకపోగా నష్టమే ఎక్కువ జరిగిందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​ కోసం డీపీఆర్​ సమర్పించిన సమయంలో రూ.55,086 కోట్లు అన్నారు. కానీ రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. 90 శాతం పనులు ఎలా అయితాని కేసీఆర్​ను ప్రశ్నించారు. ప్రాజెక్ట్ కోసం ఇంకా 30 వేల భూమిని సేకరించాల్సి ఉందన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...