అక్షరటుడే, వెబ్డెస్క్: Jagtial accident | జగిత్యాల జిల్లాలో (Jagtial district) విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు కూలీలు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం (Mallapur mandal) ముగిలిపేట వద్ద మంగళవారం సాయంత్రం ట్రాక్టర్ బోల్తా పడింది. మొగిలిపేట గ్రామానికి చెందిన 15 మంది మహిళలు కూలీ పనుల నిమిత్తం ట్రాక్టర్లో వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మొగిలిపేట శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
Jagtial accident | పసుపు తవ్వడానికి వెళ్లి..
పసుపు (turmeric) తవ్వడానికి కూలీ పనులకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో మొగిలిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.